ముంబైలో చిక్కుకున్న తెలంగాణ వాసులు

మెదక్‌ :  వివాహానికి వెళ్లి ముంబైలో చిక్కుకున్న వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 30 మంది ఉన్నారు. ఇందులో మెదక్‌ జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ ఏరియా, కుమ్మరి వాడకు చెందిన వారు 20 మంది కాగా.. హైదరాబాద్‌ వాసులు 8 మంది, సంగారెడ్డి జిల్లాకు చెందిన వారు ఇద్దరు. ముంబైలో గత నెల (మార్చి) 19న వివాహం ఉండగా.. వీరందరూ అదే నెల 15న అక్కడికి వెళ్లారు. తిరుగు ప్రయాణానికి ముందస్తుగా 22వ తేదీన రిజర్వేషన్‌ సైతం చేసుకున్నారు. అయితే కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో ప్రధాని మోదీ 22వ తేదీన జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తర్వాత 23వ తేదీన సైతం టికెట్లు బుక్‌ చేశారు. కానీ ఈ రోజు నుంచే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు కావడంతో తెలంగాణ వాసులు ముంబైలోనే చిక్కుకుపోయారు. గడువు పొడిగింపుతో ఇక్కట్లు వివాహ అనంతరం తప్పని పరిస్థితుల్లో బాధితులు ముంబై సెంట్రల్‌ నాగ్పాడా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కామాటిపుర ఆరో లేన్‌లో రెండు కమ్యూనిటీ భవనాలు అద్దెకు తీసుకున్నారు. (కరోనా : వారి అనుమానం అతని ప్రాణం తీసింది)